నాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన భానుపై చర్యలు తీసుకోండి: రోజా
- రూ. 2 వేలు ఇస్తే ఏమైనా చేసేదని భాను అన్నారన్న రోజా
- వ్యాంప్ కు ఎక్కువ అని నీచంగా మాట్లాడారని ఆవేదన
- చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు గాలి భాను తనను దుర్భాషలాడుతూ బాధ పెట్టారని రోజా అన్నారు. ఇది కేవలం తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని... అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించేందుకు ధైర్యం చేసిన ప్రతి మహిళపై జరిగిన దాడి అని చెప్పారు. ఇది ఒక ప్రమాదకరమైన సంస్కృతి అని అన్నారు.