Baahubali: మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి’... రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా విడుదల

SS Rajamouli Baahubali Celebrates 10 Years with Re release
షార్ట్స్‌లో చూడండి
భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ సంయుక్త భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. "పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న, సమాధానం రెండూ కలిసి ఒకే గ్రాండ్ ఎపిక్‌గా వస్తున్నాయి" అంటూ ప్రభాస్ పేర్కొన్నారు. ఎన్నో జ్ఞాపకాలు, అంతులేని స్ఫూర్తినిచ్చిన ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు.

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా చూడాలన్న అభిమానుల కోరిక ఈ రీ-రిలీజ్‌తో నెరవేరనుంది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత కూడా అదే ఆదరణతో ‘బాహుబలి’ మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.
Go Back to Shorts
Baahubali
Prabhas
SS Rajamouli
Baahubali The Beginning
Baahubali The Conclusion
Indian Cinema
Telugu Movie
Epic Movie
Re-release
October 31

More Telugu News