కవిత మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వాస్తవమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్న రాజాసింగ్
- పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలుస్తారని వ్యాఖ్య
- అభ్యర్థుల ఎంపిక కూడా వారే నిర్ణయిస్తారని ఆరోపణ
- గతంలోనూ ఇలాంటి కుమ్మక్కులతో పార్టీ నష్టపోయిందని ఆవేదన
- సొంత నేతల వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని విమర్శ
రాజాసింగ్ మాట్లాడుతూ, "భారీ ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో కలిసిపోతారు. అంతేకాకుండా, బీజేపీ తరఫున ఎవరు, ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా వారే నిర్ణయిస్తారు. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానివల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయింది" అని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ కొందరు బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని, ఈ అంతర్గత కుమ్మక్కుల వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజాసింగ్ సూచించారు. "వాస్తవానికి మన పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇతర పార్టీల నాయకులతో మన సొంత పార్టీ నేతలు కుమ్మక్కు కావడం అందరికీ తెలిసిన విషయమే" అని ఆయన వ్యాఖ్యానించారు.