పహల్గామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం: జైశంకర్ సంచలన ఆరోపణ
- మతం అడిగి 26 మంది పౌరులను ఉగ్రవాదులు చంపారని వెల్లడి
- కశ్మీర్కు ఆర్థిక మూలాధారమైన పర్యాటకాన్ని దెబ్బతీసే కుట్ర అన్న జైశంకర్
- ఆర్మీ చీఫ్ అభిప్రాయాలకు, ఉగ్రవాదుల చర్యలకు మధ్య సంబంధం ఉందని వ్యాఖ్య
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందారు) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన మతతత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. "తాము హిందువుల కంటే భిన్నమని మీ పిల్లలకు బోధించండి" అని పాక్ పౌరులకు మునీర్ పిలుపునివ్వడం, కశ్మీర్ను పాకిస్థాన్ 'జీవనాడి'గా అభివర్ణించడం వంటివి ఉద్రిక్తతలను మరింత పెంచాయని జైశంకర్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు, ఉగ్రవాదుల చర్యలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇదే సమయంలో, పీఓకే భారత్లో అంతర్భాగమని, దానిని పాకిస్థాన్ తిరిగి అప్పగించాలని జైశంకర్ మరోసారి డిమాండ్ చేశారు.