భారత సాయుధ దళాలకు నా సెల్యూట్.. ఏపీ సీఎం చంద్రబాబు
- మన దేశం తనను తాను రక్షించుకుంటుందని సైన్యం నిరూపించిందన్నచంద్రబాబు
- మోదీ నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రశంసలు
- దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందన్న ఏపీ సీఎం
పాకిస్థాన్, పీవోకేలో దాడుల తర్వాత భారత సాయుధ దళాలను ప్రశంసించిన మొదటి రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో దేశభక్తితో కూడిన ‘జై హింద్!’ అంటూ తన మద్దతు ప్రకటించారు. సాయుధ దళాల విజయాన్ని గుర్తించిన తొలి స్వరాలలో ఇది ఒకటి. తరువాతి పోస్ట్లో సాయుధ దళాల అసాధారణ ధైర్యాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని చంద్రబాబు ప్రశంసించారు.
కేంద్ర ప్రభుత్వ చర్యలకు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తూ, మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రశంసిస్తూ “ఈ రోజు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచం మన బలం, దృఢ సంకల్పాన్ని చూసింది. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. మన సాయుధ దళాలకు మద్దతు ఇస్తుంది” అని ప్రకటించారు.