దేవుడి దయతో ఆమె ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా: రజనీకాంత్
- భార్య లత సాంస్కృతిక కార్యక్రమంలో రజనీకాంత్ ప్రసంగం
- పాశ్చాత్య సంస్కృతిని యువత గుడ్డిగా అనుసరించడంపై విమర్శ
- దేశ గొప్పదనం, సంప్రదాయాలపై యువతకు అవగాహన లోపం ఉందని వెల్లడి
- విదేశీయులు సైతం మన శాంతి, యోగా వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యలు
ఈ మొబైల్ యుగంలో చాలా మంది యువతకు, చివరికి కొందరు పెద్దలకు కూడా మన దేశ గొప్ప సంప్రదాయాల గురించి తెలియడం లేదని ఆయన అన్నారు. భారతదేశపు ఘనమైన వారసత్వం, విలువలను తెలుసుకోకుండానే పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన మూలాలను మరిచిపోవడం సరికాదని హితవు పలికారు.
విదేశీయులు సైతం వారి సంస్కృతుల్లో శాంతి, సంతోషాలను పొందలేక మన దేశం వైపు చూస్తున్నారని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇక్కడి యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.