పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు.. కేంద్రమంత్రి బండి సంజయ్
- పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అన్న మంత్రి
- ఈ ఘటనకు ప్రతీకారంగా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని వ్యాఖ్య
- ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా ఉండాలని పిలుపు
ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ... పహల్గామ్ పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. కానీ, తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలివాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.