పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం అవార్డు
- ఈ నెల 8న సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడిన కార్మికులు
- వారిని ‘లైఫ్ సేవర్’ అవార్డుతో సత్కరించిన ప్రభుత్వం
ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. తాము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో అరుస్తూ కనిపించారని తెలిపారు. కొందరు పిల్లలు మూడో అంతస్తు నుంచి దూకేయాలని కూడా చూశారన్నారు. వారితో మాట్లాడి దూకకుండా చూశామని, ఆ తర్వాత వారిని రక్షించి కిందికి తీసుకొచ్చామని వివరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారిని కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నామని వివరించారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ దంపతులు.. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న కుమారుడు మార్క్ శంకర్ను ఇండియాకు తీసుకొచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 20 మంది గాయపడ్డారు.