ఏపీ డీజీపీ ఆఫీసులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. విజేతలకు డీజీపీ భార్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
- మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమన్న వక్తలు
- విజేతలకు బహుమతులు అందజేసిన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆర్ధాంగి సీమా గుప్తా
మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని, మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధించి, ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీమా గుప్తా చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజిపి రాజకుమారి, డిఐజి కమ్యూనికేషన్స్ ఎన్ ఎస్ జే లక్ష్మి, డిసీపీ సరిత, డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు.

.