జేపీ నడ్డాను కలిసిన ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లతో బీజేపీ ఘన విజయం
- ముఖ్యమంత్రి రేసులో పలువురి పేర్లు
- నడ్డాను మర్యాదపూర్వకంగానే కలిశామన్న ఎమ్మెల్యేలు
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసినట్లు చెప్పారు. ఈ భేటీలో శాసనసభాపక్ష సమావేశం గురించి గానీ, ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై గానీ చర్చ జరగలేదని తెలిపారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన అమెరికా పర్యటన ముగించుకొని భారత్ వస్తారు. ఆయన భారత్ తిరిగి వచ్చాక బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాసం ఉందని భావిస్తున్నారు.