ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం
- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
- మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్
- ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు
ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా సాగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.