నాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ యజమాన్యం బెయిల్‌ పిటిష‌న్

Sandhya Theatre Management Approached to Nampally Court
  • తొక్కిస‌లాట కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ యజమానులు
  • బెయిల్‌ పిటిషన్ వేసిన థియేటర్‌ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి 
  • ఈ కేసులో 'ఏ1'గా పెద్దరామిరెడ్డి, 'ఏ2'గా చిన్నరామిరెడ్డి
  • మ‌రికాసేప‌ట్లో బ‌న్నీ రెగ్యులర్‌ బెయిల్‌పై తీర్పు
డిసెంబ‌ర్ 4న 'పుష్ప‌2' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా చోటు చేసుకున్న‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యజమాన్యం తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. 

సంధ్య‌ థియేటర్‌ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి బెయిల్‌ పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో 'ఏ1'గా పెద్దరామిరెడ్డి, 'ఏ2'గా చిన్నరామిరెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే. దాంతో కౌంటర్‌ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను న్యాయ‌స్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నార‌ని తెలుస్తోంది.

మ‌రికాసేట‌ప‌ట్లో బ‌న్నీ రెగ్యులర్‌ బెయిల్‌పై తీర్పు
ఇక ఈ కేసులో న‌టుడు అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు ఇవ్వ‌నుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి (శుక్రవారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Sandhya Theatre Stampede
Nampally Court
Allu Arjun
Tollywood

More Telugu News