బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ 234 ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
- మెల్బోర్న్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు
- టీమిండియా ముందు 340 పరుగుల భారీ టార్గెట్
- 5 వికెట్లతో రాణించిన జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీ (70) తో రాణించగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 41, నాథన్ లైయన్ 41 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. అలాగే మహ్మద్ సిరాజ్ 3, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 21/0. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (07), యశస్వి జైస్వాల్ (10) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 319 పరుగులు కావాలి.