పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు
- గౌడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసు
- జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ పై కేసు నమోదు
- ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామన్న న్యాయమూర్తి
పేర్ని నాని భార్య పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ లో నిల్వ ఉంచిన 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమయింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ తేజపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.