అరంగేట్ర ఆటగాడితో వాగ్వాదం.. కోహ్లీని ఘోరంగా అవమానించిన ఆసీస్ మీడియా!
- మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు
- అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం
- కోహ్లీని సర్కస్ జోకర్తో పోల్చిన ఆసీస్ మీడియా
- అక్కడి మీడియాలో 'క్లౌన్ కోహ్లీ' పేరిట కథనాలు
కోహ్లీ, కాన్స్టాస్ మధ్య వాగ్వాదం..
ఇన్నింగ్స్ పదో ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. సామ్ కాన్స్టాస్ దూకుడుగా ఆడుతుండడంతో అతడిని కోహ్లీ కవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్ అనంతరం యువ ఆటగాడు నడుచుకుంటూ మరో ఎండ్కు వెళుతున్న సమయంలో ఎదురుగా వెళ్లిన కోహ్లీ అతడి భుజాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కోహ్లీకి షాకిచ్చిన ఐసీసీ..
ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించింది. అంతేగాక అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చింది.