మహేశ్ బాబు-రాజమౌళి సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Tammareddy Bharadwaj estimated that the budget of Mahesh Rajamouli film may cross Rs1000 crores
  • ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు దాటవచ్చన్న దర్శక నిర్మాత
  • సినిమా వసూళ్లు రూ.2000 కోట్లు దాటతాయని అంచనా
  • భారతదేశ సినీరంగంలోనే ఈ సినిమా చరిత్ర అవుతుందని వ్యాఖ్య
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుందని, తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటవచ్చని భరద్వాజ అంచనా వేశారు. బాహుబలి సినిమా విడుదలయ్యాక తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, రూ.100 కోట్ల సినిమా అంటే సాధారణ అంశంలా మారిపోయిందని అన్నారు. ఇక ఎన్టీఆర్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌ తర్వాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్‌గా కనిపిస్తోందని, ప్రస్తుతం మహేశ్‌ సినిమా వచ్చాక రూ.500 కోట్లు సాధారణ విషయంలా అనిపిస్తోందని చెప్పారు.

వసూళ్లు రూ.3-4 వేల కోట్లు ఉండొచ్చు
ఈ సినిమా కనీసం రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుపుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. వసూళ్లు రూ.3-4 వేల కోట్ల వరకు రావొచ్చని అన్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తును రాజమౌళి చాలా బాగా ఊహిస్తారని, ‘ఎస్ఎస్ఎంబ29’ ద్వారా మరోసారి ఆయన సత్తా చాటనున్నారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ బిజినెస్‌ ఊహించడం కూడా కష్టమని, రూ.3-4 వేల కోట్ల వసూలు చేస్తే భారతదేశ సినీరంగంలోనే చరిత్ర అవుతుందని భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ29’ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నానని ఆయన అభిలషించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా ‘ఎస్ఎస్ఎంబీ29’ ప్రాజెక్ట్ లొకేషన్ల కోసం దర్శకుడు రాజమౌళి అన్వేషిస్తున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
SSMB29
Mahesh Babu
Rajamouli
Tollywood
Movie News

More Telugu News