ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదం: కొండచరియలు విరిగిపడి ఏడుగురు కార్మికుల మృతి
- ఉత్తరాఖండ్ హైడ్రో ప్రాజెక్టులో కొండచరియలు విరిగిపడి ప్రమాదం
- టన్నెల్లోకి బురద నీరు చేరడంతో చిక్కుకుపోయిన కార్మికులు
- పదుల సంఖ్యలో గాయాలు, మరో ఆరుగురి కోసం గాలింపు
- యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
- సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యవేక్షణ, ఝార్ఖండ్ సీఎం ఆరా
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లోకి కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బురదలో చిక్కుకుపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం పీపల్కోటి సమీపంలో చోటుచేసుకుంది.
తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్డీసీ) నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో కార్మికులు పనిచేస్తున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో టన్నెల్ పైభాగంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో టన్నెల్లోకి భారీగా బురద, నీరు, రాళ్లు దూసుకొచ్చాయి. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న సుమారు 22 మంది కార్మికులు బయటకు రాలేక చిక్కుకుపోయారు.
ప్రమాదం గురించి తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెవీ డ్యూటీ పంపుల సాయంతో టన్నెల్లోని బురద నీటిని బయటకు తోడుతూ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు బయటకు తీసిన వారిలో ఏడుగురు మరణించగా, గాయపడిన 10 మందిని గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బురద కింద చిక్కుకున్న మరో ఆరుగురి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ఝార్ఖండ్ కార్మికులు కూడా ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్.. ధామితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని ధామి హామీ ఇచ్చారు.
తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్డీసీ) నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో కార్మికులు పనిచేస్తున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో టన్నెల్ పైభాగంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో టన్నెల్లోకి భారీగా బురద, నీరు, రాళ్లు దూసుకొచ్చాయి. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న సుమారు 22 మంది కార్మికులు బయటకు రాలేక చిక్కుకుపోయారు.
ప్రమాదం గురించి తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెవీ డ్యూటీ పంపుల సాయంతో టన్నెల్లోని బురద నీటిని బయటకు తోడుతూ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు బయటకు తీసిన వారిలో ఏడుగురు మరణించగా, గాయపడిన 10 మందిని గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బురద కింద చిక్కుకున్న మరో ఆరుగురి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ఝార్ఖండ్ కార్మికులు కూడా ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్.. ధామితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని ధామి హామీ ఇచ్చారు.