సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో... భట్టి విక్రమార్కకు ఝార్ఖండ్ లో... ఏఐసీసీ కీలక బాధ్యతలు
- మహా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ
- ఝార్ఖండ్ లో పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ
మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా... ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.