పాక్‌లో దారుణం.. వాహనాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. వీడియో ఇదిగో!

పాక్‌లో దారుణం.. వాహనాలను తనిఖీ చేసి 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. వీడియో ఇదిగో!

Militants killed 23 after forcing them out of vehicles in Balochistan
  • బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఘటన
  • పంజాబ్(పాక్) నుంచి వస్తున్న వాహనాలే లక్ష్యం
  • పది వాహనాలకు నిప్పు
  • బలూచిస్థాన్ ఆర్మీ పనేనని అనుమానం
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ముసాఖైల్ జిల్లాలో 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు. పంజాబ్ (పాక్) నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పది వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ ఘటన వెనక బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా ఉంది.  ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫ్‌రాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బీఎల్ఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
Pakistan
Balochistan
BLA
Punjab

More Telugu News