కశ్మీర్ లోయను కుదిపేసిన రెండు వరుస భూకంపాలు
- ఈ ఉదయం 7 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు
- రెండింటి భూకంప కేంద్రాలూ బారాముల్లా జిల్లాలోనే
- ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీసిన ప్రజలు
రెండు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారాల గురించి వాకబు చేయడంతో ఫోన్ లైన్లు అన్నీ బిజీగా మారిపోయాయి. 8 అక్టోబర్ 2005లో ఇక్కడ 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి 80 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.