బందరులో పేర్ని నాని తనయుడి పరిస్థితి ఇలా ఉంది...!
- బందరు నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ
- 15,001 ఓట్ల ముందంజలో ఉన్న టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర
- ఇప్పటివరకు 5 రౌండ్ల లెక్కింపు పూర్తి
బందరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, పేర్ని కృష్ణమూర్తి బాగా వెనుకబడిపోయారు. ఆయన కంటే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 15,001 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఐదు రౌండ్ల అనంతరం కొల్లు రవీంద్రకు 33,343 ఓట్లు రాగా, పేర్ని కృష్ణమూర్తికి 18,342 ఓట్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ మరో 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలుంది.