తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం
- ఈ ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- మునిగిన లోతట్టు ప్రాంతాలు
- వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందన్న ఐఎండీ
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లోనూ వచ్చే రెండు రోజుల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని వివరించింది.