రాజీనామా ఆమోదంపై గంటా పిటిషన్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు
- 2021లో గంటా చేసిన రాజీనామాను ఆమోదించిన స్పీకర్
- నిబంధనల ప్రకారం రాజీనామా ఆమోదం జరగలేదని హైకోర్టులో గంటా పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
తన రాజీనామా ఆమోదం నిబంధనల ప్రకారం జరగలేదని తన పిటిషన్ లో గంటా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శికి, చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.