రేషన్తో పాటు రూ.1000 నగదును పంపిణీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
- పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2 కోట్ల రేషన్దారులకు పొంగల్ కానుక
- ఆళ్వార్పేటలో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి
- పొంగల్ కానుక నేపథ్యంలో రద్దీ నివారణకు టోకెన్లు జారీ చేసిన ప్రభుత్వం
సమానత్వం, సౌభ్రాతృత్వం అందరి హృదయాల్లో, ఇళ్లల్లో వర్ధిల్లాలని... ప్రతిచోట ఆనందం నిండాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులకు ఉచిత ధోతీ, చీరల పంపిణీని కూడా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రేషన్ దుకాణాలలో వీటిని పంపిణీ చేస్తారు. పొంగల్ కానుక కోసం జనం రద్దీని నివారించేందుకు ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. ఎవరు ఏ రోజు... ఏ సమయంలో రేషన్ దుకాణాల వద్దకు వచ్చి కానుకలను తీసుకు వెళ్లాలనే వివరాలను ఆ టోకెన్లలో పేర్కొన్నారు.