కేశినేని నాని కార్యాలయంలో టీడీపీ జెండాల తొలగింపు!

TDP flags removes from Kesineni office in Vijayawada
  • టీడీపీకి దూరం జరిగిన కేశినేని నాని
  • ఇవాళ తిరువూరు సభకు గైర్హాజరు
  • పసుపు జెండాలు లేకుండా బోసిపోయినట్టుగా కనిపిస్తున్న కేశినేని నాని ఆఫీసు
విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ తనను వద్దనుకుంటున్నప్పుడు తాను కూడా పార్టీతో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా కదలిరా సభ నిర్వహించగా, ఈ సభకు కేశినేని దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో కేశినేని నాని కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు తొలగించేశారు. పసుపు జెండాలు లేని కేశినేని నాని ఆఫీసు బోసిపోయినట్టుగా దర్శనమిస్తోంది.
Advertisement
Kesineni Nani
TDP
Flags
Vijayawada

More Telugu News