Chandrababu: యువగళం విజయోత్సవ సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan to attend Yuvagalam vijayotsava sabha
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Pawan Kalyan
YSRCP

More Telugu News