ఒకే విమానంలో మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి రోజా
- తిరుపతి నుంచి విజయవాడకు ఇండిగో విమానంలో ప్రయాణించిన టీడీపీ అధినేత, మంత్రి
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక లాంజ్ ద్వారా రోజాను బయటకు పంపిన పోలీసులు
- వీరిద్దరి రాకకు 10 నిమిషాల ముందు అదే ఎయిర్పోర్టులో దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు, రోజా ప్రయాణించిన విమానం విజయవాడకు చేరుకోవడానికి 10 నిమిషాల ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే విమానాశ్రయంలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మంగళగిరి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య నారా భువనేశ్వరితో కలిసి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే.