Nara Brahmani: నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను: లోకేశ్ ను ఉద్దేశించి నారా బ్రాహ్మణి ట్వీట్

Nara Brahmani tweets on Lokesh
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. నేడు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పునఃప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు విశేషంగా తరలివచ్చాయి. తాటిపాక సభకు భారీ స్పందన లభించింది. 

దీనిపై లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి స్పందించారు. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను అంటూ బ్రాహ్మణి ట్వీట్ చేశారు. అంతేకాదు, లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం దృశ్యాలను ఫొటోల రూపంలో పంచుకున్నారు. 

స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో నారా లోకేశ్ తన పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కించారు. జనవరి 27న ప్రారంభమైన యువగళం సెప్టెంబరు 9న నిలిచిపోయింది. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. మళ్లీ 79 రోజుల విరామం తర్వాత పాదయాత్ర మొదలైంది.
Go Back to Shorts
Nara Brahmani
Nara Lokesh
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News