Advertisement

విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతి కోసం కమిటీ ఏర్పాటు

Committee on CM camp office and accomodation has established
  • విశాఖ నుంచి పరిపాలన కోసం ఏర్పాట్లు
  • సన్నాహాలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి
విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయదశమికి విశాఖ వెళ్లిపోతామని సీఎం జగన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ముమ్మరం అయ్యాయి. విశాఖలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రుల వసతి, సీనియర్ అధికారుల తరలింపు, వసతి గుర్తింపు కోసం అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర  సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
Advertisement
CM Jagan
Visakhapatnam
YSRCP
Capital
Andhra Pradesh

More Telugu News