ఆసియా క్రీడల్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ అరుదైన రికార్డు
- నేడు రెండు రజతాలు నెగ్గిన యువ షూటర్
- ఈ క్రీడల్లో 4 పతకాలు సాధించిన భారత మహిళా షూటర్ గా రికార్డు
- భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు
కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రెండో స్థానంతో రజతం గెలవగా, పాలక్ స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మరోవైపు పురుషుల రైఫిల్ 3 పొజిషన్ల విభాగంలో భారత జట్టు స్వర్ణం గెలిచింది. ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సురేశ్, అఖిల్ షెరాన్ తో కూడిన పురుషుల జట్టు 1769 స్కోరుతో అగ్ర స్థానంతో బంగారు పతకం గెలిచింది. పురుషుల డబుల్స్ టెన్నిస్ లో ఫైనల్లో ఓడిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, రామ్ కుమార్ రామనాథన్ ద్వయం రజతం సాధించింది. మొత్తంగా శుక్రవారం భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది.