Vijay Sai Reddy: చంద్రబాబు కనిపెట్టిన వాటి పేటెంట్ కోసం కేంద్రం ప్రయత్నించాలి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి సెటైర్లు

Vijayasaireddy satires on TDP cheif chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఐటీని, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని చెబుతారని, అదే నిజమైతే వాటి పేటెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ సెటైర్లు వేశారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేతపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తుంటారు. సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ వేదికగా పలుమార్లు విమర్శలు గుప్పించడం, చురకలు అంటించడం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో టీడీపీ అధినేతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Rajya Sabha

More Telugu News