Raghu Rama Krishna Raju: వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చిరంజీవి బాగా మాట్లాడారు: రఘురామకృష్ణ రాజు

Chiranjeevi well spoken about AP Govt says Raghu Rama Krishna Raju
షార్ట్స్‌లో చూడండి
 ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మీద ఎందుకు పడుతున్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ... ప్రభుత్వం గురించి చిరంజీవి చాలా చక్కగా, బుద్ధి వచ్చేలా మాట్లాడారని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు సీఎం జగన్ ను సీబీఐ పిలిచే ఉంటుందని... అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల వెళ్లి ఉండకపోవచ్చని చెప్పారు. మూడు నెలలు సమయం అడిగి ఉండొచ్చని అన్నారు. వివేకా హత్య కేసులో నిజమైన దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను ఒకటి చెపితే సీబీఐ మరొకటి రాసిందని అజేయ కల్లం అనవసరంగా పిటిషన్ వేశారని అన్నారు.  

Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Chiranjeevi
Tollywood

More Telugu News