'బేబి' పాత్ర గురించి వినగానే భయపడ్డాను: వైష్ణవీ చైతన్య
- క్రితం నెలలో విడుదలైన 'బేబి'
- ఆ సినిమాతో పెరిగిపోయిన వైష్ణవి క్రేజ్
- ముందుగా చేయనని చెప్పానని వెల్లడి
- మేకర్స్ ధైర్యం చెప్పడం వలన చేశానని వ్యాఖ్య
ఈ సందర్భంగా తాజాగా 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవి మాట్లాడుతూ .. "ఈ కథను సాయిరాజేశ్ గారు నాకు చెప్పారు. నా పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన బెడ్ రూమ్ సీన్స్ గురించి చెప్పినప్పుడు భయపడ్డాను. ఈ సీన్ ను సెట్లో ఎలా చేయాలి? ఎలా వస్తుంది? ఇది బయటికి ఎలా వెళుతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయంలో చాలా టెన్షన్ పడిపోయాను" అని అన్నారు.
" నా భయాలన్నిటినీ నేను సాయిరాజేశ్ గారి ముందుంచాను. ఈ సినిమా నేను చేయను అని చెప్పాను. అప్పుడు ఆయన హీరోయిన్ స్వభావం .. ఆమె తీసుకునే నిర్ణయాలకు గల కారణాలను గురించి నాకు వివరంగా చెప్పారు. అప్పుడు ఆ సీన్స్ చేయడానికి నాకు ధైర్యం వచ్చింది. ఇలాంటి సీన్స్ చేయనున్నట్టు మా పేరెంట్స్ కి ముందే చెప్పాను. వాళ్లు కూడా ఓకే చెప్పిన తరువాతనే చేశాను" అని చెప్పుకొచ్చారు.