Pawan Kalyan: ఈ నెల 9న ఏలూరు నుండి పవన్ రెండోదశ వారాహి విజయయాత్ర

Varahi Yatra second phase from 9th of this month
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర రెండోదశ ఈ నెల 9వ తేదీన ఏలూరు నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేత హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి యాత్ర రెండో దశ ఏలూరు నుండి ప్రారంభించడానికి పవన్ కల్యాణ్ సంకల్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్ ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండోదశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena

More Telugu News