అజిత్ పవార్ సహా 9 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్
- ఏక్నాథ్ షిండే కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్
- మంత్రులుగా మరో 8 మంది
- వారిని ద్రోహులుగా పిలవలేమన్న పార్టీ చీఫ్ జయంత్ పాటిల్
ఎలక్షన్ కమిషన్ను కలిసి అన్ని జిల్లాల కార్యకర్తలు శరద్ పవార్తోనే ఉన్నారని స్పష్టం చేసినట్టు తెలిపారు. 9 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ కాబోరని జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. వారి ప్రమాణ స్వీకారం పార్టీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. తమ అధినేత అంగీకారం లేకుండానే వారు ప్రమాణ స్వీకారం చేసినట్టు చెప్పారు. ఆ తొమ్మిదిమంది సాంకేతికంగా పార్టీ నుంచి అనర్హతకు గురైనట్టేనని వివరించారు. అయితే, వారిని ద్రోహులుగా పిలవలేమని, వారి ద్రోహం ఇంకా రుజువు కాలేదని జయంత్ పాటిల్ తెలిపారు. వారిలో చాలామంది తమతో టచ్లోనే ఉన్నారని పేర్కొన్నారు.