క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

software employee died of heart attack in hyderabad
  • రంగారెడ్డి జిల్లా కేసీఆర్ స్టేడియంలో ఘటన
  • మ్యాచ్ మధ్యలోనే వెన్నునొప్పితో బయటకొచ్చిన మణికంఠ
  • కారులో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ తుదిశ్వాస
  • మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లా వాసి
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వచ్చిన మర్రిపూడి మణికంఠ హఠాన్మరణం పొందారు. మణికంఠ సోదరుడు వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మణికంఠ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నగరంలోని కేపీహెచ్ బీలో ఓ హాస్టల్ లో ఉంటున్నామని, వారాంతంలో మిగతా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుంటామని వెంకటేశ్ చెప్పారు.

శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ స్టేడియంలో మ్యాచ్ ఉందని వెళ్లాడని వెంకటేశ్ చెప్పారు. మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్ చేసి మణికంఠ చనిపోయాడని చెప్పాడన్నారు. క్రికెట్ ఆడుతుండగా వెన్నునొప్పి వస్తుందని చెప్పి వెళ్లి కారులో పడుకున్నాడని, మ్యాచ్ అయిపోయాక పిలిచినా పలకకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించాడన్నారు. అయితే, అప్పటికే మణికంఠ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికంఠ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Cricket
Hyderabad
software employee
heart attack
death

More Telugu News