Budget 2020: కేంద్ర వార్షిక బడ్జెట్... హైలైట్స్-1

  • పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
  • వివిధ రంగాలకు కేటాయింపులు
  • బడ్జెట్ మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడి
Union budget details part 1

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు కేటాయింపులను ప్రకటించారు. 2023-24 వార్షిక బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45.03 లక్షల కోట్లు అని ప్రకటించారు. బడ్జెట్ లో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లు అని వెల్లడించారు.

  • వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు 
  • శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం 
  • పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం 
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత 
  • గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు 

  • వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు 
  • వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు 
  • రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు 
  • దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్ 
  • పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు 

  • ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం 
  • సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు 
  • నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం 
  • గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు  

  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు 
  • రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు 
  • రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు 
  • 2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు 

  • కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు 
  • ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు 
  • ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం  
  • పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు 

  • 5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు
  • ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు 
  • ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ 

  • కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత 
  • కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు 
  • కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం 
  • నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు 
  • పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు 

More Telugu News