Praveen: సెన్సార్ పూర్తిచేసుకున్న 'రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం'

  • నక్సలిజం నేపథ్యంలో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' 
  • సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా
  • దర్శకుడిగా జై దీప్ విష్ణు పరిచయం  
  • ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
Rebels Of Thupakula Gudem Update

ఈ మధ్య కాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే సినిమా రాబోతోంది. వారధి క్రియేషన్స్ బ్యానర్ పై జైదీప్ విష్ణు దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 

ప్రవీణ్‌ ..  శ్రీకాంత్ రాథోడ్ .. శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య 'రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. 

ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో డైలాగ్స్ ..  విజువల్స్ ..  నటీనటుల పర్ఫామెన్స్‌ ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నారు. 

అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఎంతో గొప్పగా ఈ చిత్రాన్ని తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.   

More Telugu News