Akshay Kumar: సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాక కూడా వివాదాలు బాధిస్తాయి: అక్షయ్ కుమార్

  • అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ ట్రైలర్ విడుదల
  • మోదీ వ్యాఖ్యలతో కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పిన అక్షయ్ కుమార్
  • మోదీ ప్రభావశీల వ్యక్తి అని ప్రశంసలు
Bollywood Actor Akshay Kumar Praises Modi

షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల మాట్లాడుతూ.. సినిమాల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. దేశంలోనే మోదీ అతిపెద్ద ప్రభావశీల వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యలు మార్పు తీసుకురాగలిగితే సినీ పరిశ్రమకు కొంతైనా మేలు జరుగుతుందని అన్నారు. 

సినిమాలు తీసేందుకు తాము చాలా శ్రమిస్తామని, ఆ తర్వాత వాటికి సెన్సార్ సర్టిఫికెట్ పొందుతామన్నారు. ఇవన్నీ అయ్యాక కూడా ఎవరో అనవసర వ్యాఖ్యలు చేయడంతో వివాదం తెరపైకి వస్తుందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నటించిన ‘సెల్ఫీ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా  అక్షయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News