Team India: రెండో వన్డేలో కివీస్ ను చిత్తుచేసి సిరీస్ చేజిక్కించుకున్న భారత్

  • రాయ్ పూర్ లో మ్యాచ్
  • న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్
  • 8 వికెట్ల తేడాతో విజయం
  • 20.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన వైనం
  • రోహిత్ శర్మ ఫిప్టీ... నిలకడగా ఆడిన గిల్
Team India defeated New Zealand in 2nd ODI and clinch series

సొంతగడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. నేడు న్యూజిలాండ్ తో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్... అనంతరం 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ (51) అర్ధసెంచరీతో అలరించగా, తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో షిప్లే 1, శాంట్నర్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఈ నెల 24న మూడో వన్డే జరగనుంది. నామమాత్రంగా మారిన ఈ వన్డేకు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా నిలవనుంది.

More Telugu News