Sensex: మళ్లీ లాభాల బాట పట్టిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల వరుస లాభాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 59,141కి పెరిగింది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 17,622 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), బజాజ్ ఫైనాన్స్ (2.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.92%), నెస్లే ఇండియా (1.83%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.12%), ఎన్టీపీసీ (-1.04%), ఏసియన్ పెయింట్స్ (-1.04%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News