Sri Simha: ఆసక్తిని రేపుతున్న 'దొంగలున్నారు జాగ్రత్త' ట్రైలర్

  • హీరోగా కీరవాణి తనయుడు శ్రీ సింహా 
  • గతంలో వచ్చిన రెండు సినిమాలు 
  • కొత్త కాన్సెప్ట్ తో చేసిన 'దొంగలున్నారు జాగ్రత్త'
  • ఈ నెల 23వ తేదీన సినిమా రిలీజ్
Dingalunnaru  jagrattha trailer released

కీరవాణి తనయుడు శ్రీ సింహా కొంతకాలం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నుంచి 'మత్తువదలరా' .. 'తెల్లవారితే గురువారం' సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కొత్త ప్రయోగం అనిపించుకున్నాయి. అదే తరహాలో శ్రీ సింహా ఇప్పుడు మరో ప్రయత్నం చేశాడు. ఆ సినిమా పేరే 'దొంగలున్నారు జాగ్రత్త'.

సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేశ్ బాబు - సునీత నిర్మించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

దారి పక్కనే ఆగిన ఒక ఖరీదైన కారు లాక్ ను హీరో దొంగతనంగా ఓపెన్ చేసి ఎక్కుతాడు. ఆ తరువాత అతను ఆ కారులో నుంచి బయటపడదామంటే లాక్ ఓపెన్ కాదు. ఏ రకంగా బయటపడదామని ఆయన ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. అదే సమయంలో ఆ కారులో బాంబు ఫిక్స్ చేసి ఉందనీ .. అది మరి కాసేపట్లో పేలుతుందనే విషయం అతనికి తెలుస్తుంది. ఇలా ట్రైలర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు

More Telugu News