Uma Maheswari: మెడ భాగంలో స్వ‌ర‌పేటిక విర‌గ‌డంతో ఉమామ‌హేశ్వ‌రి మృతి... వెల్ల‌డించిన పోస్టుమార్టం నివేదిక‌

  • ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉమా మ‌హేశ్వ‌రి
  • ఉరితో ఉమా మ‌హేశ్వ‌రి స్వ‌ర‌పేటిక విరిగింద‌న్న వైద్యులు
  • పోస్టుమార్టం నివేదిక‌ను పోలీసుల‌కు అందించిన ఉస్మానియా వైద్యులు
osmania doctors submitted uma maheswari postmortum report to police

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు చిన్న కుమార్తె ఉమా మ‌హేశ్వ‌రి ఉరేసుకున్న కార‌ణంగానే మృతి చెందింద‌ని పోస్టుమార్టం నివేదిక వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఉమా మ‌హేశ్వ‌రి మృత దేహానికి శ‌వ ప‌రీక్ష నిర్వ‌హించిన‌ ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదిక‌ను నేడు జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు అంద‌జేశారు. ఉరేసుకున్న కార‌ణంగా ఉమా మ‌హేశ్వ‌రి మెడ భాగంలో స్వ‌ర‌పేటిక విరిగింద‌ని, ఈ కార‌ణంగానే ఆమె మ‌ర‌ణింద‌ని వైద్యులు తమ నివేదికలో వెల్ల‌డించారు.  

More Telugu News