కరోనా వేళ కాలేజీల మూత... 33 నెలల జీతం వెనక్కి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
07-07-2022 Thu 18:58
- బీహార్ లో 2019లో ఉద్యోగంలో చేరిన లలన్ కుమార్
- కొన్ని నెలలకే దేశంలో కరోనా సంక్షోభం
- దీర్ఘకాలం పాటు లాక్ డౌన్లు
- విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోయానన్న లలన్
- రూ.24 లక్షల జీతం వెనక్కి ఇచ్చేసిన వైనం

బీహార్ కు చెందిన లలన్ కుమార్ హిందీ భాషా అసిస్టెంట్ ఫ్రొఫెసర్. ముజఫర్ పూర్ లోని ఓ కాలేజీలో 2019లో ఉద్యోగంలో చేరారు. ఆయనకు నెలకు రూ.80 వేల వరకు జీతం వస్తుంది. కాగా, లలన్ కుమార్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే దేశంలో కరోనా వ్యాప్తి మొదలవడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. లాక్ డౌన్ల ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా కుంటుపడింది.
ఈ నేపథ్యంలో, లలన్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 33 నెలల జీతాన్ని వెనక్కి ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి వల్ల తాను పనిచేస్తున్న విద్యాసంస్థ కూడా మూతపడిందని, తను విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోయానని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో బోధన జరిగినా, దానివల్ల ఎక్కువమందికి ప్రయోజనం లభించలేదని పేర్కొన్నారు. అందుకే, కరోనా వ్యాప్తి సమయంలో తాను జీతం రూపంలో పొందిన రూ.24 లక్షలను వెనక్కి ఇచ్చేస్తున్నానని లలన్ కుమార్ ప్రకటించారు.
తాను కాలేజీలో చేరిన తర్వాత కొన్నినెలలలోనే కరోనా సంక్షోభం వచ్చిందని, ఒక్కరోజు కూడా సరిగా పాఠాలు చెప్పలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పకుండా జీతం తీసుకోవడానికి తన మనస్సాక్షి అంగీకరించడంలేదని నిజాయతీని ప్రదర్శించారు. ఈ క్రమంలో తన జీతాన్ని చెక్కు రూపంలో అధికారులకు తిరిగిచ్చేశారు.
కాగా, లలన్ కుమార్ చర్యపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లలన్ కుమార్ కొన్నాళ్ల కిందట పీజీ విభాగానికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ ఎత్తుగడకు పాల్పడ్డాడని అతడు పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, లలన్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 33 నెలల జీతాన్ని వెనక్కి ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి వల్ల తాను పనిచేస్తున్న విద్యాసంస్థ కూడా మూతపడిందని, తను విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోయానని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో బోధన జరిగినా, దానివల్ల ఎక్కువమందికి ప్రయోజనం లభించలేదని పేర్కొన్నారు. అందుకే, కరోనా వ్యాప్తి సమయంలో తాను జీతం రూపంలో పొందిన రూ.24 లక్షలను వెనక్కి ఇచ్చేస్తున్నానని లలన్ కుమార్ ప్రకటించారు.
తాను కాలేజీలో చేరిన తర్వాత కొన్నినెలలలోనే కరోనా సంక్షోభం వచ్చిందని, ఒక్కరోజు కూడా సరిగా పాఠాలు చెప్పలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పకుండా జీతం తీసుకోవడానికి తన మనస్సాక్షి అంగీకరించడంలేదని నిజాయతీని ప్రదర్శించారు. ఈ క్రమంలో తన జీతాన్ని చెక్కు రూపంలో అధికారులకు తిరిగిచ్చేశారు.
కాగా, లలన్ కుమార్ చర్యపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లలన్ కుమార్ కొన్నాళ్ల కిందట పీజీ విభాగానికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ ఎత్తుగడకు పాల్పడ్డాడని అతడు పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు.
More Telugu News

తెలంగాణలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు
8 hours ago




ఆయనే మా పునాది: అల్లు అర్జున్
10 hours ago




భారత్, చైనా వాయుసేనల మధ్య ఇక డైరెక్ట్ లింకు
13 hours ago

ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
13 hours ago
Advertisement
Video News

Live: ABN MD RK to file defamation case against Gorantla Madhav for Rs. 10 crores
6 hours ago
Advertisement 36

9 PM Telugu News: 10th August 2022
6 hours ago

Comedian Raju Srivastava hospitalised after cardiac arrest in Gym
7 hours ago

Telangana: IB warns of terrorist attacks around I-Day
8 hours ago

Liger countdown begins - A special video released by movie team on Puri Jagannadh- Vijay Deverakonda
8 hours ago

PM Modi goes all guns blazing at Congress, hurls black magic taunt; Congress hits back
9 hours ago

Nara Lokesh to launch a 'Mobile Hospital' in the Mangalagiri constituency at his own expense
10 hours ago

Hyderabad: A Doctor sentenced to 10 years in 2016 se*ual assault case
10 hours ago

Nara Lokesh reacts to SP's comment on Gorantla Madhav report
11 hours ago

Sunil Bansal new BJP in-charge for Telangana
11 hours ago

Nara Lokesh Press Meet- LIVE
11 hours ago

LIVE: MP Gorantla Madhav press meet
12 hours ago

LIVE- Anantapur SP Fakkirappa on Gorantla Madhav controversial video
12 hours ago

Former Pak cricketer Shoaib Akhtar shares emotional video after undergoing knee surgery in Australia
12 hours ago

Hyderabad Metro regains its lost glory- A special report
13 hours ago

Watch: Nitish Kumar takes oath as Bihar CM for 8th time
14 hours ago