sensex: వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 427 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 143 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఐదున్నర శాతానికి పైగా పెరిగిన టైటాన్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు దిగిరావడంతో పాటు, అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 54,178కి పెరిగింది. నిఫ్టీ 143 పాయింట్లు పుంజుకుని 16,132 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (5.69%), టాటా స్టీల్ (4.88%), ఎల్ అండ్ టీ (3.52%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.57%). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.26%), నెస్లే ఇండియా (-1.14%), భారతి ఎయిర్ టెల్ (-1.05%), రిలయన్స్ (-1.01%), బజాజ్ ఫైనాన్స్ (-0.98%).

More Telugu News