Vizianagaram: విజయనగరం జిల్లాలో నేడు దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయనున్న చినజీయర్ స్వామి

  • చినజీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలో చదువుకున్న గణేశ్
  • వందమంది చిన్నారులకు భగవద్గీత నేర్పిన గణేశ్
  • ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం
  • నేటి సాయంత్రం 5 గంటలకు భూమి పూజ చేయనున్న చినజీయర్ స్వామి
Chinna jeeyar Swamy will lay the foundation stone for a Dalit house in Vizianagaram district today

చినజీయర్ స్వామి నేడు విజయనగరం జిల్లాలోని గంట్యాడలో ఓ దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయనున్నారు. గ్రామానికి చెందిన చేపల గణేశ్ అంధుడు. చినజీయర్ స్వామి ట్రస్టు ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలోనే చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న గణేశ్ 100 మంది చిన్నారులకు భగవద్గీత కూడా నేర్పించాడు.

ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం చినజీయర్ స్వామి గంట్యాడలో గీతా పారాయణం నిర్వహించారు. కాగా, గణేశ్‌కు ఇటీవల ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ఆయన చినజీయర్ స్వామికి చెప్పడంతో శంకుస్థాపన చేసేందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నేటి సాయంత్రం 5 గంటలకు స్వామి తన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు గణేశ్ తెలిపాడు.

More Telugu News