Dil Raju: 'ఎఫ్‌-3' సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచ‌డంపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన‌ దిల్ రాజు

  • ఈ నెల 27న 'ఎఫ్‌-3' సినిమా విడుద‌ల‌
  • ఈ సినిమా టికెట్ ధర‌ల‌ను పెంచడం లేదన్న రాజు
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్ర‌యిస్తామ‌ని వ్యాఖ్య‌
dil raju gives clarity on f3 ticket rates

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన‌ 'ఎఫ్‌-3' సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో విడుద‌ల స‌మ‌యంలో ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచే అంశంపై నిర్మాత దిల్ రాజు స్ప‌ష్ట‌త నిచ్చారు. ఈ సినిమా టికెట్ ధర‌ల‌ను పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే తాము ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. ఇటీవ‌ల విడుదలైన ప‌లు పెద్ద సినిమాల టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. 

కాగా, డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే క‌థ‌నంతో 'ఎఫ్‌-3' సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పొల్గొంటోంది. 

More Telugu News