Balka Suman: రేవంత్‌రెడ్డికి ఏమైనా జరిగితే మా బాధ్య‌త కాదు: బాల్క సుమ‌న్

  • ఓట్ల కోసం చిల్ల‌ర రాజ‌కీయాలు
  • చిప్ప‌కూడు తినేందుకు రెడీగా ఉండాలి
  • ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రాన్ని ప్ర‌శ్నించాలన్న సుమన్ 
balka suman comments on tpcc chief revanth reddy

టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ యువ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా జ‌రిగితే మా బాధ్య‌త కాదంటూ సుమన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 

తెలంగాణ‌లో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇందులోకి తాజాగా మంగ‌ళ‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య మంగ‌ళ‌వారం మొత్తం ట్వీట్ల వార్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన బాల్క సుమ‌న్ కాంగ్రెస్ పార్టీ తీరుపై.. ప్ర‌త్యేకించి రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుప‌డ్డారు. ఓట్ల కోసం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న సుమన్.. చిప్పకూడు తినేందుకు రెడీగా ఉండాలంటూ హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న రేవంత్ రెడ్డికి ఏమైనా జ‌రిగితే మా బాధ్య‌త కాదంటూ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు సూచించారు.

  • Loading...

More Telugu News