Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. 1,736 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Markets ends in profits
  • ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తత తగ్గిందనే వార్తలతో మార్కెట్లలో జోష్
  • 509 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  
  • 5 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గాయనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఈరోజు మార్కెట్లు దూసుకుపోయాయి.

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,736 పాయింట్లు లాభపడి 58,142కి ఎగబాకింది. నిఫ్టీ 509 పాయింట్లు పెరిగి 17,352కి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ (5.13), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.55), బజాజ్ ఫిన్ సర్వ్ (4.46), ఎల్ అండ్ టీ (4.11), టైటాన్ (4.02) టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
Sensex
Nifty
Stock Market

More Telugu News