Sensex: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits due union budget
షార్ట్స్‌లో చూడండి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈరోజు ఆమె ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 814 పాయింట్లు లాభపడి 58,014కి చేరుకుంది. నిఫ్టీ 238 పాయింట్లు పుంజుకుని 17,340కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (4.88%), విప్రో (3.70%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.22%), ఇన్ఫోసిస్ (3.05%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.87%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.38%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News